Thursday, September 20, 2007

చెట్టినాడు స్పెషల్



అందరికి నమస్కారం.చెట్టినాడు స్పెషల్ విందు ఆరగించేముందు ఒక విషయం. నాకు ఉద్యొగం వచ్చింది.కనుక ఇంక అంత ఎక్కువగా టపాలు వెయలేకపొవచ్చు.కాని సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తాను.రెండు బ్లాగులు మెయింటైన్ చెయ్యాలి.చాలా కష్టమయిన పని అయినా ఇష్టంగా చెయ్యలనుకుంటున్నాను.ఇక ఇది ఆపి చెట్టినాడు స్పెషల్ విందు ఆరగించండి.

చెట్టినాడు తమిళనాడులోని ఒక ప్రాంతం.ఆ ప్రాంతానికి ఆ పేరు రావటనికి కారణం నట్టుకొట్టై చెట్టియార్స్.ఆ కులం వాళ్ళు ఎక్కువగా వుండే ప్రాంతం కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.మొదట్లో 96 గ్రామాలు కలిసి చెట్టినాడు ప్రాంతంగా పిలిచేవారు.ఇప్పుడు చాలా మంది వలస వెళ్ళిపోవతంవల్ల ఆ గ్రామలు 75 కి తగ్గిపొయాయి.ముఖ్యముగా చెట్టినాడు అంటే "కారైకూడి","దేవకొట్టై"; పరిసరప్రాంతాలు కలిపి పిలుస్తారు.

ఎంటి ఆ చెట్టియారుల సంగతి అంటే వాళ్ళు చాల ధనవంతులు.వాళ్ళు డబ్బులు అప్పులు ఇవ్వటం,వసూల్ చేయటం అది పని.ఇప్పుడు వున్న బాంక్ లావాదేవీలు,వాళ్ళు ఆ కాలంలోనే మొదలుపెట్టారు.ఇప్పటి చిట్ ఫండ్ కంపనీలకి వాళ్ళే ఆద్యులు.1875నుంచి 1925 వరకు మన దేశ ఆర్ధిక వ్యవస్థని వీళ్ళే శాసించారు.తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది అనేక ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వలస వెళితే అక్కడ కుమారస్వామి గుళ్ళు కట్టించేవారు.అందుకే మీకు బర్మా,మలేషియా,శ్రీలంక,థాయిలాండ్ లాంటి చోట్ల ఆ గుడులుకనిపిస్తాయి. మనుషులు చూడటానికి సౌమ్యంగా వుండి వీళ్ళా ఇంత లావాదేవిలు నడిపేది అనిపిస్తుంది.



శివున్ని,కుమారస్వామిని ఎక్కువగా కొలిచేవారు.ఇంటిపెద్ద అన్ని లావాదేవీలు చూస్తే ఇంటావిడ అందరికి వండివార్చేది.ఇళ్ళు అంటే గుర్తుకొచ్చింది అసలు స్పెషలే అది.వాళ్ళ ఇళ్ళ డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవలసిందే.ఒక వీధిలో సిం హద్వారం వుంటే ఇంకో వీధిలో వెనకద్వారం వుంటుంది.రెండు వీధుల మధ్య వున్న ఆ విశాలమైన ఇంటిలో ఎంతో ఎత్తున నిర్మించిన పైకప్పు,ప్రతేక్య పూత పూయబడిన గోడలవల్ల మండువేసవిలోనూ చల్లగా,ధారాళంగా గాలివీస్తూ సౌకర్యంగా వుంటాయి.

ఇంటి నిర్మాణంలో వాడిన రంగూన్ టేకు,రాజస్థాని చలువరాయి ఇంటికి మరింత అందాలను తెచ్చి మనల్ని ఆకట్టుకుంటాయి.సిం హద్వారానికి వుండే నగిషి ఆ చెట్టిగారి సంపదను తెలయచేస్తుంది.ద్వారానికి అటు,ఇటు అరుగులు,ఒకవైపు ధాన్యాగారాలు,మరోవైపు సామాను భధ్రపరిచే గదులు,మధ్యలో విశాలమైన మండువా.మొదటి మండువా దాటి వెళిటే రెండొవ మండువా,మూడవ మండువా.రెండువ మండువా చుట్టూ పడక గదులుంటాయి.ఇంటిలో ఒక పెద్ద భొషాణం లాంటి పెట్టి వుంటుంది ఇందులోనే వడ్డిలకు తిరిగే డబ్బు దాచేవారు.జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సాంబ సినిమాలో ఈ ఇళ్ళు చూడొచ్చు.నేను పుదుక్కొట్టైలో చదివేటప్పుడు ఆ సినిమా షూటింగ్ జరిగితే అందరు వెళ్ళాము.
ఇక ఇంటి అందాలు చూడండి.









ఇక ఇంకో స్పెషల్ చెట్టినాడు ఫుడ్.అక్కడ వుండే వయసులో పెద్దవాళ్ళైన ఆడవాళ్ళని "ఆచి" అంటారు.వాళ్ళు కొన్ని ప్రతేకమైన మషాలాలు దట్టించి వండే వంటలు అమోఘం.ఆవంటలనే చెన్నైలోనే కాక విదేశాలలోని తమిళులు హోటల్స్లో చెట్టినాడు స్పెషల్ అని చెప్పి అందిస్తారు.కాని అందరు ఆ రుచి అందించలేరు.చెట్టినాడు చికెన్ కర్రి తయార్.ఆరగించండి.



ఇక ఇంకో స్పెషల్ చూడండి.ఇది చెట్టినాడు మహిళల సాంప్రదాయ తాళి .ఇది చాల బరువు వుంటుంది.ఎలా మోస్తారోగాని ఇప్పటికి ఇలాంటివే వాడతారు.దీని ధర లక్షనుంచి లక్ష్న్నర వరకు వుంటుంది.


ఇన్ని ప్రతేకతలు వున్న ఆ ప్రాంతం ఒక పర్యాటకప్రదేశం గా మారకుండా వుంటుందా.ఎలా వుందండి చెట్టినాడు స్పెషల్ .అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను.నచ్చితే చెప్పండి.ధన్యవాదాలు.

Monday, September 17, 2007

పరవై మునియమ్మ పాట పాడితే

ఈ టపా రాయటానికి ముఖ్యకారణం తమిళ గ్రామీణ కొయిలమ్మ పరవై మునియమ్మ గురించి వివరించటానికి.తెలుగు బ్లాగులో అరవ గోల ఎంటి అనుకుంటే మీ ఇష్టం చదవక్కరలేదు.


పరవై మునియమ్మ తమిళ జానపద పాటల్లో ఒక మెరుపు.మదురై సమీపంలోని "పరవై" ఆమె ఊరు.పల్లెసీమల్లో పెరగటం వల్ల ఆమెకు చిన్నపటినుంచి పాటలంటే ప్రాణం.అందరిలాగే ఎదొ పాడుతున్న ఆమె భర్త ప్రోత్సాహాంతో కచేరీలు చేసేది.అలా తెలుగులో బంగారం సినిమాకి దర్శకత్వం వహించిన ధరణి కంట్లో పడి విక్రం నటించిన ధూల్(తెలుగులో రవితేజా నటించిన వీడే సినిమాలో తెలంగాణా శకుంతల పాత్ర)సిన్మాలో పాత్ర చేసే అవకాశం పొందింది.



ఆ సినిమాలో అమె పాడిన పాట విన్న తమిళజనం ఆ గొంతు విని ఊగిపోయారు.అది గంభీరమైన గొంతు.పక్కా మాస్ జానపదాలు కలిసిన పాటలకు పెట్టింది పేరు పరవై మునియమ్మ.నిండైన కట్టుతో,నుదిటున రూపాయి బిళ్ళంత బొట్టుతో అచ్చమైన తమిళ పాటి(బామ్మ)లా వుండే మునియమ్మ ఇప్పటికి 30 సినిమాలలో నటించారు.ఏ సినిమాలో ఐనా తన పాట తనే పాడుతూ జనాలని అలరిస్తున్నారు.ఇప్పుడు చెవులకే కాదు సన్ టివిలో వచ్చే వంటల కార్యక్రమంలో గ్రామీణ వంటకాలతో ప్రేక్షకుల కంటికి కూడా విందు చేస్తున్నారు.ఒక పక్క వంట వండుతూ బోనస్ గా పాటలు కూడా వినిపిస్తారు.



ఇంతకి ఆమె వయసు ఎంతో తెలుసా ? 67 ఏళ్ళు.ఈ వయసులో కూడా జనాలని తన పాటలతో,నటనతో అలరించే పరవై మునియమ్మ నిజంగా గ్రేట్.పరవై మునియమ్మ పాట పాడితే జనం పాదం కదపరా.

Saturday, September 15, 2007

వినాయకచవితి శుభాకాంక్షలు







శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిసం
అనేక దంతం భక్తానాం ఏక దంతముముపాస్మహే


అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు.

Wednesday, September 12, 2007

ఆనలుగురు

అందరికి నమస్కారం.
ఆనలుగురు ఎవరు?ఎమిటి విషయం అనుకుంటున్నారా?ఆనలుగురు గురించి చెప్పేముందు కొన్ని విషయాలు చెప్పాలి.కొత్తగా ఆ వూరికి వచ్చినమాకు వాళ్లే పెద్దదిక్కు అయ్యారు.అన్ని వేళలా మాకు సహాయపడుతూ మమ్మలిని తమ సొంత మనుషులుగా చూసుకున్న ఆనలుగురికి ఈ టపా అంకితం ఇస్తున్నాను.

అది మేము కాలేజ్లో జాయిన్ అవ్వటానికి వచ్చిన రోజులు.అంతా కొత్త.కొత్త ఊరు,భాష తెలీదు,ఎవరితో ఎమి మాట్లడాలో తెలీదు.ఒక కన్సల్టన్సి ద్వారా అక్కడికి వెళ్ళాం.కాలేజో సీట్ ఐతే దొరికింది కాని వుండటానికి హాస్టల్లో సీటు దొరకలేదు.చాలా మంది స్టూడెంట్స్ బయటే రూములు తీసుకుని వుంటారు.ఎలాగైతే మాకు ఒక ఇల్లు దొరికింది.అది ఇల్లుకాదు పొదరిల్లు.మంచి మనుషుల వున్న మమతలకోవెల.ఏంటి కపిత్వం ఎక్కువైందా.సరే అది వేరే ఎవరొ కాదు మా కాలేజ్ అడ్మినిస్టేట్ అఫీసర్ గారి ఇల్లు.టైటెల్ లొని ఆనలుగురు లోని ఇద్దరే ఆయన తల్లితండ్రులు.ఆయన రిటైర్డ్ ఎస్ పి.ఆవిడ గ్రుహిణి.చెప్తున్నానని కాదుగాని మమ్మల్ని సొంత పిల్లలాగ చూసేవారు.పండగలు,పబ్బాలు అందరం కలిసి చేసుకొనేవాళ్లం.మాకు ఎవరికి ఒంట్లొ బాగుండకపొయినా వేడినీళ్ళని,అవని ఇవని ఎదో సయం చేస్తునేవుండేవాళ్ళు.మేము ఇంటికి దూరమయ్యామని తెలీకుండా వుండటంకోసం తెలుగు ఉగాది అని వేరే పండుగలని మాకొసం పిండివంటలు అవి చేసి ఇచ్చేవాళ్లు.ఇక కాలక్షేపానికి వాళ్ళ పాత బ్లాక్ అండ్ వైట్ టివి మాకు ఇచ్చారు.మా అద్రుష్టమెంటంటే పక్క ఇంట్లొ ఎవరు వుండరు.ఇదివరుకు వున్నవాళ్ళు వాడిన కేబుల్ వైరు అలాగే వుండేది.అది పెట్టుకుని సినిమాలు,తమిళ చానల్స్ చూసేవాళ్ళం.ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి మా కోసం ఎదురు చూసేవాళ్ళు.మాది పై పోర్షన్ .వాళ్ళు కింద వుండేవాళ్ళు.మేము వస్తే గాని గేట్ వెసేవాళ్ళు కాదు.అందరు వచ్చారలేదొ కనుకుని అప్పుడు గేట్ వేసేవాళ్ళు.లెకపోతే మాకొసం ఎదురు చూసేవాళ్ళు.ఇంకా చాలా సంగతులు వున్నయి కాని ప్రస్తుతం గుర్తురావటం లేదు.

మిగిలిన ఇద్దరు లొ ఒకతని పేరు నాగరాజన్.అసలు తమిళనాడు లో సాయంత్రం భోజనం వుండదు.అంతా సాయంత్రం టిఫిన్సే.ఎక్కడో చెన్నై లాంటి కొన్ని చొట్ల అది అంధ్రా మెస్సుల్లొ మాత్రమే వుంటుంది.పైగా తమిళ్ నాడులో హోటెల్స్ లో అన్నం కూడా అంత బాగోదు.అలాంటి చొట మాకు రెండు పూటలా అన్నం పెట్టిన మనిషి.నెలకి వెయ్యి రూపాయలికి పొద్దున్న టిఫిన్,రెండు పూటలా భొజనం పెట్టేవాడు.

ఇక ఈ వరసలో చివరే కాని మా మనసుల్లో కాదు.అతని పేరు వీరాస్వామి.అతను అక్కడి గవర్న్మెంట్ బస్ కండక్టర్.అసలు అతను ఎల పరిచయమో కుడా గుర్తులేదు.మాకు బస్లో ఎప్పుడు తగలలేదు.మా సీనియర్స్ ద్వారా పరిచయం అనుకుంట.తమిళుడైనా,వయసులో పెద్ద ఐనా మా స్నేహానికి భాష కాని,వయసుకాని అడ్డురాలేదు.అసలు మేమంటే ఎంత అభిమానమో చెప్పలేను.రెండుసార్లు ఇంటికి పిలిచి భొజనం పెట్టారు.ఎప్పుడు ఎవొ ఒకటి తెస్తూ వుండేవారు.అంత మంచి మనిషి నేను మళ్ళి చూడలేదు.నేను చేసిన తప్పు నంబర్ తీసుకొవకపోవటం.ఈ మధ్య ఎలగో ఒక నంబర్ సంపాదించి కాల్ చేస్తే ఎవరో కయ్యిమని లేచారు.రాంగ్ నంబర్ అనుకుంట.పర్లేదు ఎప్పుడొ ఒకప్పుడు మళ్ళి కలుస్తానని నాకు నమ్మకం వుంది.ఆనలుగురికి నా బ్లాగు తరుపున,నా తరుపునా ధన్యవాదాలు.

Monday, September 10, 2007

పుదుకొట్టై చూసొద్దాం రండి.

పుదుకొట్టై - తమిళ్ లో "పుదు" అంటే కొత్త "కొట్టై" అంటే కోట మొత్తంగా కొత్తకోట అన్నమాట.పుదుకొట్టై అనేది జిల్లా పేరు మరియు ఊరి పేరు.అదే ఆ జిల్లా ముఖ్య రాజధాని.ఇది తిరుచిరాపల్లి(తిరుచ్చి) నుంచి సుమారు 54 కి.మీ వుంటుంది.కాని గంట,గంటంపావు లోపు అక్కడికి చేరుకొవచ్చు.అంతా జాతీయ రహదారి కావటం వల్ల బస్సులు అంత ఫాస్ట్ గా వెళ్తాయి.పుదుకొట్టై నుంచి మదురై 106 కి.మీ. రెండు నుంచి రెండుంపావు గంటల్లో అక్కడికి వెళ్లవచ్చు.తిరుచ్చి నుంచి మదురై వెళ్ళే దారిలోనే ఇది వుంది.ఒకప్పుడు పల్లవులు,చొళులు,హోయసాళులు,విజయనగర రాజులు,మదురై నాయకరాజుల ఏలుబడిలోవున్న ఈ పట్టణం తరువాత తొండమన్ చక్రవర్తులు ద్వారా ఆంగ్లేయుల పాలనలొకి వెళ్లి స్వాతంత్రం తర్వాత ప్రజాస్వామ్యం లో కలిసింది.ఒకప్పుడు తిరుచ్చి కలిసివుండేది.1971 నుంచి సొంత జిల్లాగా ఆవిర్భవించింది.









ఈ భవనాలు,ఆర్చ్ బ్రిటీషర్స్ కాలంలో కట్టినవే.పేరుకి జిల్లా రాజధాని కాని అంతగా అభివ్రుద్ధి చెందలేదు.మొన్నటిదాకా మీటర్గేజ్ పాసెంజర్ రైలువ్యవస్థే వుందేది.రామేశ్వరం వెళ్లే దారిలో వుండటం వల్ల ఈ మధ్యే ఇది కూడ బ్రాడ్గేజ్గా మార్చటం జరిగింది.ఊరిలో మొత్తం నాలుగే సినిమా హాళ్ళు.అందులో రెండే మంచివి.కాలక్సేపానికి అవి ఎమి సరిపోతాయి చెప్పండి.పుదుకొలను అని ఒక పెద్ద కొలను మాత్రం వుంది.మన హుస్సేన్ సాగర్లాగ వుండకపోయిన ఎదొ వుంటుంది.అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వచ్చేవాళ్ళం.ఓ మాదిరి షాపింగ్ ఏరియా వుంటుంది. జిల్లా కి ఉత్తరాన తిరుచ్చి,తూర్పున తంజావూరు ,బంగాళఖాతం,దక్షిణాన రామనాథపురం జిల్లాలు వున్నాయి.






ఇక ఈ ఫొటొ లో వున్నవి తిరుమయం ఫొర్ట్ మరియు పల్లవుల కాలంలో కట్టిన రాక్ కట్ కేవ్ టెంపుల్ ఇది.కొండను తొలచి కట్టారు అందుకే ఆ పేరు. ఇంకా పుదుకొట్టై లో ఒక చిన్న మ్యుజియం కూడా వుంది.ఇందులో పాతకాలం నాటి సామనులు,నాణాలు మొదలైనవి వుంటాయి. ఇక్కడికి తిరుచ్చి,శ్రీరంగం,తంజావూరు,మదురై,రామేశ్వరం అన్ని కూడా దగ్గరలోనే వుంటాయి.పట్టణంలో ముస్లిం జనాభా కూడా ఎక్కువే.దీపావళి,రంజాన్ వేళల్లొ షాపింగ్ ఏరియాలో అడుగుతీసి అడుగు వెయ్యలేనంత రద్దిగా వుంటుంది.రాజధాని కావటంవల్ల ప్రభుత్వకార్యాలయాలు,కళాశాలల విద్యార్ధులతొ మాములు సమయంలో కుడా కలకలలాడుతూ వుంటుంది.మా కాలేజ్ మాత్రం వూరికి 5 కి.మీ.దూరంలో మదురై వెళ్ళే రూట్లో వుంటుంది చుట్టూ చెట్ల మధ్య ప్రశాంతంగా.

Friday, September 7, 2007

మా కాలేజ్



ఇది మా కాలేజ్.దీని పేరు జె.జె కాలేజ్.అంటే జయలలితా జయరామన్ కాలేజ్.ఈ కాలేజ్ ఎవరిదంటే మాజీ క్రేంద్ర హోం శాఖ సహాయమంత్రి,ప్రస్తుత కేంద్ర పర్యవరణం,అడవుల శాఖ సహాయమంత్రి రఘుపతి గారిది.ఆయన "అన్నా డి.ఎం.కె" లో వుండగ స్థలం తీసుకుని జయలలిత పేరు మీద కాలేజ్ పెట్టి తర్వాత "డి.ఎం.కె" లొకి జంప్ జిలాని అన్నమాట.ఇప్పుడు "డి.ఎం.కె" తరుపున కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు.ఇప్పుడు ఆయన కూతురు,అల్లుడు దీని భాద్యతలు చూసుకుంటున్నారు.ఈ కాలేజ్లోనే నేను ఎమెస్సీ వెలగపెట్టాం అన్నమాట.ఇది తమిళనాడు లోని పుదుకొట్టై లో వుంది.తిరుచినాపల్లి(తిరుచ్చి)నుంచి ఒక గంట ప్రయాణం.



ఈయనే రఘుపతిగారు.ఈకాలేజ్ స్థాపకులు.


ఇది కాలేజ్ మెయిన్ బిల్డింగ్.పైనుంచి చూస్తే లోటస్(పద్మం) ఆకారంలో కనిపించేలాగ దీనిని కట్టారు.ఇందులోనే దాదాపు అన్ని కార్యకలాపలు జరుగుతాయి.



ఇది సైన్స్ సబ్జెక్ట్స్ సంబందించిన లాబొరెటరి బ్లాక్ .ఇక్కడే లాబ్ వర్క్స్ జరుగుతాయి.




ఇది ఎంబీఎ బ్లాక్ .



ఇది హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ లాబ్.ఇంకా నర్సింగ్,కాంటిన్,హాస్టల్స్ మొదలగు వాటితో చిన్న యునివర్సిటి లాగ వుంటుంది.


ఇది ఇండోర్ స్టేడియం.మా చివరి సంవత్సరంలొ మొదలు పెట్టి మేము కాలేజ్ వదిలే సమయానికి ఇది పూర్తి చేసి 2 సంవత్సరాల క్రితం దీనిని ప్రారంభించారు.ఫొటొలొ కన్నా నిజంగా చుస్తే అద్బుతంగా వుంటుంది. ఎక్కడికెళ్ళినా తెలుగు వాళ్ళే అన్నట్లు ఈ కాలేజ్ లో 50 శాతం మంది తెలుగు వాళ్ళే.30 శాతం మంది మలయాళీలు.మిగిలిన 20 శాతం మంది తమిళులు.అది ఈ కాలేజ్ స్పెషల్.
ఇది మా కాలేజ్ గురించిన సుత్తి కధ.

మా పుదుకొట్టై గురించిన విషయాలు తరువాతి టపాలో.

Tuesday, September 4, 2007

సింహాచలం

అందరికి నమస్కారం.


నేను డిగ్రీ లో వుండగ మా ఫ్రెండ్స్ ఆరుగురు కలిసి సరదాగ వైజాగ్ టూర్ కి వెళ్ళాం.మా స్నేహితులలొ ఒక అబ్బాయి వాళ్ళ పెదనాన్నగారు సింహాచలం గుడిలొ ప్రధాన అర్చకులు.మాకు వాళ్ల ఇంట్లోనే మకాం.పొద్దున్నే అన్ని పనులు ముగించి గుడికి బయలుదేరాము.కొండ మీద వెలసిన శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటానికి రెండు మార్గాలు వున్నాయి.ఒకటి మెట్లదారి.రెండు గాట్ రోడ్లో బస్ ప్రయాణం.మేము వెళ్ళటప్పుడు బస్ కి వచ్చేటప్పుడు మెట్లమీదుగ నడిచివచ్చాం.గుడిలొ ఉచితదర్శనం,50రూ|| ప్రత్యేక దర్శనం వున్నాయి.మేము పూజారిగారి తరుపున కాబట్టి మాకు ప్రత్యేక దర్శనంలొ ఉచితదర్శనం.గర్బగుడి దగ్గరకు వెళ్ళే అద్రుష్టం కలిగింది.కావలసినంత సేపు దర్శనం చేసుకుని తరవాత పూజరిగారు ఇచ్చిన పులిహోర,దద్దొజనం,పొంగలి సుబ్బరంగా లాగించి గుడిలో మళ్లి ఒకసారి రౌండ్ వేసి మెట్లమీదుగా దిగివచ్చేసాం.

చరిత్ర:




ప్రహ్లాదుని రక్షించటానికి నరసింహావతారంలోఅవతరించి హిరణ్యకశిపున్ని సంహరించిన తరువాత ప్రహ్లాదుని కోరికపై స్వామి ఇక్కడ వరాహలక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారు.244మీటర్ల ఎత్తెన కొండపై వెలిసిన ఈ స్వామికి 11వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని కట్టించారు.తరువాత విజయనగరరాజులైన ప్రతాపరుద్రగజపతి ఆలయానికి మరికొన్ని మెరుగులు దిద్దారు. గత రెండు దశాబ్దాలుగా విజయనగర రాజవారసులే దేవస్థాన ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.గుడిలో కప్పస్థంభం వుంటుంది.దీనిని కౌగిలించుకుని కోరికలు కోరుకుంటే నెరవేరతాయని అంటారు.

చందనోత్సవం :




ప్రతి యేడాది వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగే చందనోత్సవానికి ఆంధ్రప్రదేశ్,ఒరిస్సా,కర్ణాటక,తమిళనాడు నుంచి భక్తులు విపరీతంగా వస్తారు.ఈ చందనోత్సవాన్నే నిజరూపదర్శనం అని కూడా అంటారు.సంవత్సరంలోని 364 రోజుల 12 గంటలు చందనంతో కప్పబడి వుండే స్వామి ఆ రోజు ఉదయం 3 నుంచి సాయంత్రం వరకు మాత్రమే స్వామి నిజరూపదర్శనం కలుగుతుంది.ఆ రోజు స్వామి ఒంటి మీది చందనాన్ని తీసివేసి అభిషేకించి కొత్తగా చందనాన్ని పూస్తారు.నిజరూప దర్శనానీ మొదట విజయనగర రాజవంశీకులు చూస్తారు.తర్వాత భక్తులని అనుమతిస్తారు.ఉచిత దర్శనానంతో పాటు రూ. 30, రూ. 100, రూ. 500 , రూ. 1000 టికెట్లు అమ్ముతారు.

ప్రయాణం:

వైజాగ్ లో సింహాచలం కొండ దిగువున వుండే బస్ స్టాపుకి వెళ్లటానికి లొకల్ బస్సులు వుంటాయి.కొండ మీదకి దేవస్థానం వారు ప్రత్యేక బస్సులని నడుపుతారు.దాని టికెట్ ధర రూ.6.

Monday, September 3, 2007

శ్రీ కృష్ణాష్టమి సంగతులు

చిన్నప్పుడు కృష్ణాష్టమి వస్తుందంటే చాలు అంతా హడావిడిగా వుండేది.పది పదిహేను రోజులముందునుంచే తయారు అయ్యేవాళ్లం.ఒక రేకు అమూల్ డబ్బా తీసుకుని దాని మూతకి చిల్లు పెట్టి దాన్ని తీసుకుని చందాలు పోగుచెయ్యటానికి రోడ్డు మీద పడేవాళ్లం.రోడ్డు మీద వెళ్ళే వాళ్లని బలవంతంగా ఆపి వాళ్ల దగ్గర డబ్బులు గుంజేవాళ్లం. సైకిల్ మీద వెళ్లే వాళ్ల వెంటపడి విసిగించి మరి చందా వసూల్ చేసి మొత్తనికి డబ్బు పోగుచేసేవాళ్లం.రెండు రోజులముందు ప్రసాదాలకి కావలిసిన సరుకులు తెచ్చి ఎవరోఒకళ్ల ఇంట్లొ ఆ పని అప్పగించేవాళ్ళం.ఇక పండగ రోజు ఉట్టి కొట్టే సన్నివేశం భలేగుండేది.ఉట్టిలొ పెరుగు,డబ్బులు అవి వేసి పైన కట్టి లాగుతుంటే దానిని కొట్ట్డానికి ఎగబడేవాళ్లం.ఎవరు పగలకొడితే వాళ్లే హీరొ.అది పగిలాకా డబ్బులు ఎరుకోవటనికి పెద్ద గొడవ.ఆ డబ్బులు వాడకూడదు అని చెబితే దేవుని దగ్గర హుండిలొ వేసేసి ప్రసాదాలకోసం కొట్లాట.అప్పట్లో చానల్స్ వుండేవి కాదు కాబట్టి సినిమాలంటే పిచ్చి .ఒకరు ఇద్దరు ఇంట్లొ టివి వుండేది.వాళ్ళని బతిమాలి బామాలి ఒప్పించి వీడియొ ప్లేయర్లు,కేసెట్లు తెచ్చి రాత్రంతా సినిమాలు చూస్తూ జాగారం.అలా సరదాగ గదిచిపొయేది. ఇప్పుడు పండగ లేదు పబ్బం లేదు.రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి.

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.




చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలత్రాడు పట్టుదట్టి
సందె దాయతులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలతు


అందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

Saturday, September 1, 2007

నా తవిక

అందరికి నమస్కారం.
ఇది నా తవిక.తవిక ఏంటి అనుకుంటున్నార ఎమి లేదండి చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి రాస్తుంది చూసార తలకి రీటా,కాలికి బాటా,నాకిష్టం సపోట అని వాటిని తవికలంటారన్నమాట.అలాగని నాది హాస్య తవిక కాదు ఏదొ నాలుగు సంవత్సరాల క్రితం ఒక పైత్యం ప్రకోపించిన రోజు రాసినది ఇది . ఎంతైన నేను రాసినది కద కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు నా తవికని అప్పటినుంచి భద్రంగా దాచుకుని వస్తున్నాను.ఎలాగు బ్లాగు వుందిగా ఇందులో దాచుకుందామని రాసుకున్నా.

ఇక నా తవిక పేరు వసంతం.

అది ఒక చల్లని సాయంత్రం .అప్పుడే తొలకరి చిరుజల్లు కురిసి నేల తడిసింది.తడిసిన నేల నుంచి మట్టివాసన మనసును మైమరపిస్తుంది.మెల్లగ ఇంటి వెనుక పూలతోటలొకి వెళ్ళిన నాకు చల్లటి చిరుగాలి స్వాగతం పలికింది.ఆరుబయట ఆ పూలతోటలో పడుకున్న నాకు దూరంగా కొండపైన సప్తవర్ణాల ఇంద్రధనస్సు కనిపించింది.అలా చుస్తూ ఆ చల్లగాలికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను.మధ్యరాత్రి కనులు తెరచిన నాకు నిండు పున్నమి జాబిలి వెన్నెలతో జోలపాడుతున్నట్లుగా అనిపించింది.పక్కనె చిన్ని కొలనులొ చంద్రుని ప్రతిబింబం మెరుస్తుంది.కలువపూలు రెండు విచ్చుకుని ఒకదానితొ ఒకటి దోబూచులాడుకుంటున్నాయి.మైమరచిన నేను మరలా నిద్రలోకి జారుకున్నను
.
అప్పుడే తెలతెల్లగా తెలవారుతుంది.మంచు కొద్దిగ కురుస్తుంది.మల్లెలు గుభాలిస్తున్నాయి.తన లేలేత కిరణాలతో భాస్కరుడు బయలుదేరాడు.లేలేత కిరణాలు ఆకుల మీద మంచు బిందువులపై పడి ముత్యాల్లా మెరుస్తున్నాయి.పక్షులు కిలకిలరావాలు వినసొంపుగా వున్నాయి.కుహుకుహు అంటూ కోయిలమ్మ వసంతాన్ని ఆహ్వానిస్తూ నన్ను తట్టిలేపింది. కర్తవ్యం గుర్తుకొచ్చిన నేను కార్యొన్ముఖుడనై అక్కడినుంచి నిష్క్రమించాను.